కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం ఔరంగజేబు మార్గంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలనే ప్రస్తావించామని అన్నారు.కాగా ఇప్పటివరకు ఐదు దశల్లో మొత్తం 424 స్థానాల్లో పోలింగ్ ముగియగా.. 19న అఖరి దశలో మరో 59 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశలో ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు షీలా దీక్షిత్, మనోజ్ తివారీ హోరాహోరీగా తల పడుతున్నారు.