దేశ ఆర్థిక స్థితిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. వారిద్దరూ ఊహల్లో ప్రపంచంలో జీవిస్తుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. వారికి ఊహల ప్రపంచంతో తప్ప… బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండవని దుయ్యబట్టారు. వారిద్దరు సొంత ప్రపంచంలో విహరిస్తూ భ్రమల్లో తేలిపోతుంటారని అన్నారు. దేశం ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు.