telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా?: పొన్నాల

ponnala lakhmaih

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. 24గంటల విద్యుత్‌, ప్రాజెక్టుల ద్వారా నీరిస్తే పంటల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు? అని నిలదీశారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నారని పొన్నాల చెప్పుకొచ్చారు.

కరోనాపై కేసీఆర్‌ ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. . కేబినెట్‌ సమావేశంలో ప్రాధాన్యత గల అంశాలను విస్మరించారని పొన్నాల మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు అని నాటకాలు ఆడుతున్నారన్నారు.

Related posts