telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు

ponnala lakhmaih

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనన్నారు. కేసీఆర్‌ది దోపిడీ, అవినీతి కోణమని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏనాడు మాట్లాడలేదన్నారు. 700 కిలో క్యాలరీల ద్రవ హారాన్ని తీసుకుని కేసీఆర్ దొంగ దీక్ష చేశారని విమర్శించారు.

ప్రపంచ నియంతలందరిలో కేసీఆర్ మొదటి స్థానం సంపాదించారన్నారు. కేసీఆర్ రాక్షస, నియంతృత్వ పోకడకు బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ నుంచి తీసుకునేది ఎక్కువ… ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చేది తక్కువని తెలిపారు. ప్రతిపక్షాలు ఇచ్చే మంచి సలహాలు ఎందుకు స్వీకరించరని ప్రశ్నించారు. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలని పొన్నాల కోరారు.

Related posts