telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌కే కేసీఆర్ పరిమితం: కాంగ్రెస్ నేత పొన్నాల

ponnala lakhmaih

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ రైతుబంధు ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌కే కేసీఆర్ పరిమితం అయ్యారని దుయ్యబట్టారు.

రైతులు కష్టాల్లో ఉంటే రైతు సేవా సమితి నాయకులు ఏం చేస్తున్నారని పొన్నాల ప్రశ్నించారు. మద్దతు ధరకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని విమర్శించారు. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు తెచ్చుకోవడానికి ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. తెలంగాణలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనన్నారు.

Related posts