telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీనే స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని అందిస్తుంది: మోదీ

modi on jammu and kashmir rule

క‌ర్నాట‌క‌ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల ఫలితాల పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. జార్ఖండ్‌లోని హ‌జారిబాగ్‌లో జ‌రిగిన ఓ స‌భ‌లో మోదీ మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పార‌ని అన్నారు. ప్ర‌జాతీర్పును కాంగ్రెస్ పార్టీ అక్ర‌మంగా దోచేసింద‌ని విమర్శించారు. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌జ‌లు క‌ర్నాట‌క‌లో బీజేపీని గెలిపించార‌ని మోదీ అన్నారు.

బీజేపీనే స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని అందిస్తుంద‌న్నారు. ద‌క్షిణ భార‌త దేశంలో బీజేపీ పాత్ర స్వ‌ల్ప‌మే అన్న వారికి ఈ ఫలితాలు చెంప‌పెట్టు అని అన్నారు. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాతీర్పును వెన్నుపోటు పొడిచింద‌ని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆ పార్టీలు గుణ‌పాఠం నేర్చుకున్నాయ‌న్నారు. ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 11 మంది అన‌ర్హ‌త ఎమ్మెల్యేలే గెలుపొందారు.

Related posts