రైతు బంధు చెక్కులు రాలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేల్లచేరువు మండల కేంద్రంలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలసి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రైతు బంధు చెక్కులు రాలేదని, రైతుల రుణ మాఫీ ఊసే లేదని మంత్రులకు గుర్తు చేశారు.
ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాల విషయంలో ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, దయాకర్రావులు ఇద్దరు సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి వీరు కృషి చేయాలని కోరారు.