తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. శాసనమండలికి కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో లెవనెత్తలేని అంశాలపై మండలిలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని కానీ అలా ప్రవర్తించడం లేదన్నారు. మండలిలో కేవలం ఆర్థికమంత్రితోనే సరిపెడుతున్నారని అన్నారు. పలు అంశాలపై మండలిలో సమాధానాలు దొరకడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 720 మెడికల్ సీట్లను గిరిజనులు నష్టపోయారని తెలిపారు. ఉపాధ్యాయ పరీక్షల నిమిత్తం టెట్ పరీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. పంటరుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రైతులకు నేటికి అందలేదని తెలిపారు. గల్ఫ్ బాధితులకు ఆర్థిక సాయం అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఈఅంశాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సెక్రటేరియట్కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదు: వీహెచ్