తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త రెవెన్యూ వ్యవస్థను త్వరలో తీసుకొస్తామని చెబుతున్నకేసీఆర్ పై ద్వజమెత్తారు. రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు.
ఐదేళ్ల నుంచి గుర్తుకురాని అవినీతి, కేసీఆర్ కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ కు రానీ కేసీఆర్, పాలనా వ్యవస్థను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో వేల కోట్ల కమీషన్ల సొమ్మును ఖర్చు చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు.