టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖను అందజేశారు. టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్కు సమర్పించారు.స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
అనంతరం మీడియాతో రేగా కాంతారావు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం చేశామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.
కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!