telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవు: ఎమ్మెల్యే సీతక్క

seethakka mla

పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కఅన్నారు. ఈ రోజు మహబూబాబాద్‌లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లాలో ఉన్న గిరిజన ప్రజలకు ఒక్కొక్క ఇంటికి 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ చేప్పిన పంటలు వేసిన వారికే రైతు భీమా పథకం వర్తింపు చేస్తామని చేప్పడం సిగ్గు చేటన్నారు.

నేడు రైతులు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణమన్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి కమిటీలో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా ఆధికారులు ఆధికార పార్టీకి కొమ్ము కాయొద్దన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులకు ప్రోటో కాల్ లేదని సీతక్క తెలిపారు.

Related posts