telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్ పై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga reddy mla

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిన్న తెలంగాణ మంత్రి హరీష్‌రావుతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ రోజు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ప్రజలు రెండోసారి కూడా పట్టం కట్టారన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. ఆర్థిక శాఖ మంత్రిహరీష్‌రావుతో ఇకపై ఘర్షణ ఉండదు అని స్పష్టం చేశారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరి ప్రచారం వారిదేనని చెప్పారు. సంగారెడ్డిలో హరీష్‌రావుతో ప్రచారం చేసుకున్నా త్మకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ రెడ్డి అనవసరంగా మాట్లాడి చెడగొడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో పెరిగిన గ్రాఫ్‌ను రేవంత్ రెడ్డి జీరో చేసుకున్నారు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Related posts