telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి: జగ్గారెడ్డి

Jagga reddy mla

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమనిఅన్నారు. రవాణా మంత్రి ఆ పదవికి అనర్హుడని అన్నారు. ఆర్టీసీ కార్మికులు 9 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.

సమైక్యరాష్ట్రంలో ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని జగ్గారెడ్డి అన్నారు. ఇలాంటి పాలన కోరుకున్నామా అని తలదించుకోవాలన్నారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులపై సీఎంకు ఎవరు విషాన్ని నూరి పోస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం ఒక మెట్టు దిగాలని, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని జగ్గారెడ్డి సూచించారు.

Related posts