కాంగ్రెస్లో కష్టపడే నాయకులకు గుర్తింపు లేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ఢిల్లీలో లాబీయింగ్ సిస్టమ్కు స్వస్తిపలకాలన్నారు.
లాబీయింగ్ ద్వారా సీఎల్పీ ఎన్నిక జరిగితే కాంగ్రెస్కు నష్టమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగే పరిణామాలు రాహుల్కు తెలియవని అన్నారు. కేసులు, ఆర్థిక ఇబ్బందులతో గత్యంతరం లేకనే ఒంటేరు ప్రతాప్రెడ్డి పార్టీ మారారని అన్నారు. కాంగ్రెస్లోని బలహీన నేతలు టీఆర్ఎస్కు ఆకర్షితులవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల