లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పక్షనేత ఎవరనేదానిపై జరుగుతున్న చర్చకు తెరపడింది.
పశ్చిమ బెంగాల్ నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపోందిన అధీర్ చౌదరి.. గతంలో పీసీసీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. యూపీఏ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లోక్సభ పక్షనేత ఎవరనేదానిపై త్రీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పలువరు పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు అధీర్ చౌదరిని ఎంపిక చేసింది.
ఆ ముగ్గురికి ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం: యామిని