telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

22 మంది విద్యార్థులను కేటీఆర్ బలిగొన్నారు: వీహెచ్

Congress Hanmanth Rao Governor TRS agent

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విరిచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాటలు జాగ్రత్తగా రానీ కేటీఆర్. నేను రెచ్చిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది’ అని హెచ్చరించారు. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కేటీఆర్ ఇంకా పుట్టనేలేదని, అలాంటి ఆయన నన్ను బఫూన్ అంటున్నాడని మండిపడ్డారు.

కేటీఆర్‌ తన బావమరిది స్నేహితుడికి టెండర్‌ అప్పగించారన్నారు. బావమరిది మీద మోజుతో 22 మంది విద్యార్థులను కేటీఆర్ బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలు ఫిరాయించే నేతలపై ప్రజలు తిరగబడాలనీ వీహెచ్ పిలుపునిచ్చారు.

Related posts