telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఈసీ రజత్ కుమార్ సారీ చెపితే సరిపోతుందా: వీహెచ్

V H Congress Comments BC cm kcr
తెలంగాణఅసెంబ్లీ ఎన్నికల్లో  లక్షలాది ఓట్లు గల్లంతు చేసిన ఈసీ రజత్ కుమార్ సారీ చెపితే అయిపోయిందా అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి.హనుమంతరావు నిలదీసారు. మర్డర్ చేసి సారీ చెబితే సరిపోతుందా అని వీహెచ్ ఘాటుగా విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కేసిఆర్ 9 నెలల ముందే ఎన్నికలకు పోయినప్పుడే తమకు అనుమానం వచ్చిందని హనుమంతరావు అన్నారు. 
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కేసీఆర్ లాంటి వ్యక్తిలేడు కాబట్టే ఈవీఎంలు సరిగా పనిచేశాయని చెప్పుకొచ్చారు. యంత్రాన్ని ఏదైనా చేయొచ్చని వీహెచ్ అన్నారు. ఈవిఎంల ట్యాంపరింగ్ ని సైబర్ క్రైమ్ గా చూడాలని  వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల  పై మాట్లాడాలని హనుమంతరావు కోరారు.

Related posts