తెలంగాణ సీఎం కేసీఆర్ వైఫల్యంతోనే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్హౌస్లో ఉండి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల మరణాలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. కేసీఆర్ది విధానాల సర్కార్ కాదని నినాదాల సర్కార్ అంటూ విమర్శించారు. కేసీఆర్ తప్పు చేశారు కనుకనే మోదీ వద్ద మోకరిల్లారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో డ్రగ్, పబ్, ఇసుకమాఫియా రెచ్చిపోతోందన్నారు. తప్పుచేశాడు కాబట్టే మోదీ వద్ద కేసీఆర్ మోకరిల్లారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.