టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సమీప ప్రత్యర్థి గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్రెడ్డి గెలుపొందారు.
బరిలో 17 మంది అభ్యర్థులు నిలువగా, మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. రెండోస్థానంలో నిలిచిన చంద్రశేఖర్ గౌడ్కు 17268 ఓట్లు వచ్చాయి. బీజేపీ బలపరిచిన సుగుణాకర్ రావు 15077 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. . 9932 ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించారు. జీవన్రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించడం విశేషం.