telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అధికారులు కండువాల్లేని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు: జీవన్‌రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC

తెలంగాణ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పై అధికారులు అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అధికారులు కండువాల్లేని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా మారారని జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లపై కోర్టును సాకుగా చూపి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.

అధికారులు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా రిజర్వేషన్ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు అధికారులు రిజర్వేషన్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులు కావాల్సిన చోట ఇతరులకు రిజర్వేషన్లు ప్రకటించారన్నారు. రిజర్వేషన్ల పై కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని జీవన్‌రెడ్డి అన్నారు.

Related posts