telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయం కూల్చివేత కోర్టు ధిక్కరణే: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC

తెలంగాణ సచివాలయం కూల్చివేత పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2016లో సచివాలయం కూల్చివేతపై హైకోర్టుకు వెళ్లానని, ఆ కేసులో భాగంగా తాము సచివాలయాన్ని కూల్చడం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని, ఇప్పుడు సచివాల యం కూల్చివేత కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుందని స్పష్టం చేశారు.

ఇప్పుడున్న సెక్రటేరియట్‌లో భవనాలు 30–40 ఏళ్ల లోపువేనని, ఇంకా 60–70 ఏళ్ల పాటు వాటిని వినియోగించుకునే అవకాశముందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎవరూ అడగని సచివాలయం కూల్చివేత చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌వి రాచరికపు ఆలోచనలని ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని అన్నారు.

Related posts