telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హొసకోటెలో .. ప్రచారంలో ముందున్న కాంగ్రెస్ ..

congress-logo

కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల రోజునే భారీ సమావేశంతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ముందుగా కాంగ్రెస్‌ హొసకోటెలో సమావేశానికి ఏర్పాటు చేసుకోగా అదే సమయానికే నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. శనివారం హొసకోటెలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు, మాజీ మంత్రి కృష్ణభైరేగౌడతోపాటు పలువురు ర్యాలీలో పాల్గొన్నారు. హొసకోటెలో కాంగ్రె్‌సకు తిరుగులేదని వరుసగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు మరోసారి అందుకు సిద్ధం కావాలని మాజీ సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ గుర్తుతో గెలిచి మోసం చేసిన మాజీ ఎమ్మెల్యేలకు, వారి మద్దతుతో రంగంలోకి దిగాలనుకునేవారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దినేశ్‌గుండూరావు మాట్లాడుతూ 15 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతామన్నారు. కార్యకర్తల సహకారంతో అన్ని చోట్లా గెలుస్తామన్నారు. మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌, హెబ్బాళ్‌ ఎమ్మెల్యే భైరతి సురేశ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.

Related posts