తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ … కాంగ్రెస్ సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు కూన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ ఉత్తమ్ కుమార్రెడ్డికి కూన శ్రీశైలం గౌడ్ ఫ్యాక్స్ ద్వారా పంపారు. బీజేపీలో చేరే అంశంపై ఢిల్లీకి బయలు దేరారు కూన శ్రీశైలం గౌడ్. అయితే.. తన రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీశైలం గౌడ్. తాను బీజేపీలో చేరబోతున్నానని..2009లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్గా తాను గెలిచానని పేర్కొన్నారు కూన శ్రీశైలం గౌడ్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడానని..ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా ప్రజాసమస్యలపై పోరాటంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలోనూ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడలేదని ప్రజలు భావిస్తున్నారని… దీనికి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలే ఉదాహరణ అని స్పష్టం చేశారు.
previous post
next post
వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయం: గల్లా జయదేవ్