telugu navyamedia
రాజకీయ వార్తలు

ఖైదీల మధ్య 74వ పుట్టినరోజును జరుపుకోనున్న చిదంబరం!

congress chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్‌లోని జైలులో మొదటిరోజు నిద్రలేని రాత్రి గడిపారు. కొత్త వాతావరణంలో సరిగా నిద్రపోలేకపోయారు. కోర్టు ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీ పెంచడంతో ఆయనను గురువారం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించారు.

తన కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన ఏడో నంబరు జైలు గదిలోనే ఆయన్ని ఉంచారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు 74 ఏళ్ల చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించి కొన్ని సదుపాయాలు కల్పించారు.మరోవైపు ఈనెల 16న చిదంబరం తన 74వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఆ రోజు కూడా తోటి ఖైదీల మధ్య జైలు గోడల మధ్య చిదంబరం గడపనున్నారు.

Related posts