telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలి: చిదంబరం

congress chidambaram

దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను తెలంగాణా పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ‘హైదరాబాద్ లో జరిగిన పరిణామాల్లో నిజానిజాలు ఏమిటో నాకు తెలియదు.

అయితే, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేనో విషయం చెప్పదలుచుకున్నాను. ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. నిందితులు నిజంగానే పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే ఎన్ కౌంటర్ చేశారా? అన్న విషయాన్ని తేల్చాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts