telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటక, గోవా రాజకీయ సంక్షోభంపై చిదంబరం స్పందన

కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంపై మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం స్పందించారు. రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రతిరోజు దెబ్బతింటున్నందుకు ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. ఇతర పార్టీల కంటే తామే గొప్ప అని నిరూపించుకోవడానికి కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిణామాల పై పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను, పార్టీలను దెబ్బతీసే ప్రయత్నాలు దేశ ఆర్థిక పరిస్థితికి నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల ను విదేశీ పెట్టుబడిదారులు గమనిస్తున్నారని అన్నారు.ఇది దేశ ఆర్థిక స్థితికి ఏ మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.

Related posts