తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుంటే ప్రజలను గాలికి వదిలేసిన సీఎం ఫామ్హౌస్కు వెళ్లిపోయారని మండిపడ్డారు. విద్య, వైద్యం వంటి వాటిని పక్కనపెట్టి సచివాలయ కూల్చివేత, నిర్మాణాల కోసం టెండర్లు పిలుస్తున్నారని అన్నారు. ఇక ఉన్న అప్పులు సరిపోవన్నట్టు కొత్త అప్పులు చేస్తున్నారని అన్నారు.
ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని, వాటిని ఐదారు లక్షల కోట్లకు పెంచాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేటీఆర్కు ఇంగ్లిష్ మాట్లాడడం తప్ప పాలన చేతకాదని దుయ్యబట్టారు.