telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తున్న కేసీఆర్ పెద్ద సన్నాసి: భట్టి విక్రమార్క

Batti vikramarka

తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తున్న కేసీఆర్ పెద్ద సన్నాసి అని వ్యాఖ్యానించారు.అప్పులు తెచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారంటూ విమర్శించారు. ప్రాజెక్టులపై ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయాన్నారు. ఓ ప్రమాదకరమైన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

ఇప్పుడు నాలుగు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు అంటూ మరో మోసానికి కేసీఆర్ తెరలేపారంటూ భట్టి ఆరోపించారు. కాళేశ్వరం పూర్తయిందంటున్న కేసీఆర్, ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలను నీళ్లిచ్చారో చెప్పాలని నిలదీశారు. రూ.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరం కూడా తడవలేదని విమర్శించారు. కాళేశ్వరం బదలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 11 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవని భట్టి అభిప్రాయపడ్డారు.

Related posts