సీఎం జగన్ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు నియమితులయ్యారు. ఐదుగురు సభ్యులతో ఏర్పాటు ఈ కమిటీ ఏర్పాటు అయింది. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించనుంది.
డాక్టర్ మహావీర్, అర్బన్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, సెప్ట్ ప్రొఫెసర్ శివానందస్వామి, చెన్నైకు చెందిన రిటైర్డ్ అర్బన్ ప్లానర్ డాక్టర్ కేవీ.అరుణాచలం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీంతో పాటు వరదనీటి యాజమాన్యంపై కూడా ఓ సభ్యుడిని ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆరు వారాల్లో దీనికి సంబంధించిన అంశాలపై నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కశ్మీర్ లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు: ఉండవల్లి