telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కమెడియన్స్ రీ యూనియన్

తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ కమెడియన్స్ గత కొంత కాలంగా రీయూనియన్ పేరుతో ప్రతి రెండో
శనివారం కలస్తూ వస్తున్నారు. అయిత కరోనాతో ఈ కలయికకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ తో దాదాపు ఓ
ఏడాది తర్వాత ఇటీవల మళ్ళీ కలిశారు. గత శనివారం మణికొండలో వెన్నెలకిశోర్, శ్రీనివాసరెడ్డి, రఘు
కారుమంచి, సప్తగిరి, సత్య, సత్యం రాజేశ్, చిత్రం శ్రీను, ప్రవీణ్, ధనరాజ్, వేణు, తాగుబోతు రమేశ్ ఈ
కలయిలో పాలు పంచుకున్నారు. ఇకపై ప్రతి రెండో శనివారం తమ కలయిక ఉంటుందంటున్నారు ఈ
కామెడీ స్టార్స్.
తమ ఈ కలయిక తామందరిలో ఆత్మవిశ్వాశాన్ని, ఎనర్జీని పెంపొందిస్తుందన్నది వారి భావన. ఈ కలయిక
కేవలం ఎంటర్ టైన్ మెంట్ కే పరిమితం కాదని సోషల్ ఎవేర్ నెస్ కోసం కూడా అంటున్నారు. ఐ డొనేషన్,
బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలతో పాటు పలు సహాయకార్యక్రమాలకు కూడా వేదికగా
నిలుస్తుందంటున్నారు. గతంలో నటి సుభాషిని క్యాన్సర్ వైద్యం కోసం లక్ష రూపాయలు డొనేట్ చేయటం,
మనం సైతం కోసం పదివేలు, ఆనారోగ్యంతో ఉన్న డబ్బింగ్ మధు కోసం పదివేలు సాయం అందించారు
ఈ కమెడియన్స్. అంతే కాదు ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న నటీనటుల పిల్లల వైద్య, చదువుకు కూడా సాయం
అందిస్తున్నారు. గతంలోలా ఇకపై ఈ రీయూనియన్ సందర్భంగా డ్రెస్ కోడ్ పాటిస్తామని అంటున్నారు ఈ
యంగ్ కమెడియన్స్.

Related posts