telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సంప్రదాయ దుస్తుల్లో శారదాపీఠం సందర్శించిన జగన్‌

jagan attending guntur iftar tomorrow

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విశాఖప‌ట్నం చేరుకున్న వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి ఘన స్వాగ‌తం ప‌లికారు. విశాఖ‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చినముషిడివాడలోని శారద పీఠానికి వెళ్లారు.

సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించిన జ‌గ‌న్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అంత‌కుముందు జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సీఎం జగన్ తో రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. 

Related posts