ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష జరగాల్సి ఉంది. అయితే నేడు రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దు చేశారు.
ఈ సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం నుంచి వరుస భేటీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలతో బిజిబిజీగా గడుపుతున్నారు.
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెబుతాం: ఉత్తమ్