ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ఫేస్బుక్లో అనుచిత పోస్టు చేసిన ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆయనను అరెస్ట్ చేయలేదని తర్వాత పోలీసులు స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం బయట ఓ మహిళ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తాను పెళ్లి ప్రతిపాదన పంపినట్టు పేర్కొంది.
ఈ వీడియోను కనోజియా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. వీడియో కాస్తా వైరల్ అవడంతో లక్నోకు చెందిన ఓ పోలీసు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అందులో ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అటువంటిదేమీ లేదని కనోజియా కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.