telugu navyamedia
రాజకీయ

మమ్మల్ని  మీడియా చూపించదు.. మేకప్ వేసుకునే మోదీ నే చూపిస్తుంది: కుమారస్వామి

CM Kumaraswamy killing order
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై వ్యంగస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. తాము అందంగా కనిపించకపోవడం వల్లే మీడియా తమను పట్టించుకోవడం లేదన్నారు. రోజూ ముఖానికి మేకప్ వేసుకునే మోదీ అందంగా కనిపిస్తారు కాబట్టి మీడియా ఆయననే ఎక్కువగా ఫోకస్ చేస్తుందని ఆయన  అన్నారు. ప్రతిపక్ష నాయకులు అందంగా ఉండడం లేదనే మీడియా వారిని చూపించడం లేదన్నారు. 
ప్రధాని మోదీ రోజూ ఉదయాన్నే మేకప్ వేసుకుంటారని, వ్యాక్సింగ్ కూడా చేయించుకుని అందంగా కనిపిస్తారని అన్నారు. బీజేపీ నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం మానేసి మోదీ ముఖం చూసి ఓటెయ్యాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. విమర్శలు చేసేవాళ్లను స్వేచ్ఛగా చేసుకోనివ్వాలని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఇకపైనా పొత్తు కొనసాగుతుందని కుమారస్వామి స్పష్టం చేశారు.

Related posts