telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రతి రోజూ బాధను అనుభవిస్తూ పాలన: కుమారస్వామి

CM Kumaraswamy killing order

ప్రతి రోజూ బాధను అనుభవిస్తూనే పాలన సాగిస్తున్నట్టు కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కుమారస్వామి ఆ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయటకు మాత్రం ముఖ్యమంత్రినే, కానీ నేనెంత బాధను అనుభవిస్తున్నానో చెప్పలేనని అన్నారు. ప్రతీ రోజూ బాధ పడుతూనే ఉన్నానని కాంగ్రెస్‌ను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సంకీర్ణ ప్రభుత్వంతో చాలా బాధలు అనుభవిస్తున్నట్టు చెబుతూ గతవారం కన్నీళ్లు పెట్టుకున్నారు.నా బాధకు కారణం ఏంటన్నది మాత్రం బయటపెట్టలేనని కుమారస్వామి తెలిపారు. న్నారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రభుత్వం సక్రమంగా నడవాలని, ప్రభుత్వం సేఫ్‌గానే ఉందన్న ఆత్మవిశ్వాసాన్ని అధికారుల్లో నింపాల్సిన బాధ్యత తనపై ఉందని కుమారస్వామి పేర్కొన్నారు.

Related posts