కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆ పార్టీకి చేసిన సేవలకు సరైన గుర్తింపు దక్కలేదని కుమారస్వామి అన్నారు. గత కొన్నేళ్ల క్రితమే ఖర్గే ముఖ్యమంత్రి కావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్గేకు అన్యాయం జరిగిందనేని తన అభిప్రాయమని చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కండువా కప్పుకుని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకునే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకుని కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది.