telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సహకరిస్తాం: కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

ఆర్థిక వ్య్వస్థపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సరైన నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభం నుంచి కేంద్ర ప్రభుత్వం గట్టెక్కిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. యావత్ దేశం ఒకతాటిపై నిలిచి, ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి ఇది సరైన సందర్భమని తెలిపారు.

ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్, రియలెస్టేట్ తదితర రంగాలు ఆర్థిక సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పారు. ఈ రంగాలపై కేంద్రం మరింత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే ఉద్యోగాలు కోల్పోయే వారి గురించే తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి మోదీ ప్రభుత్వం బయటపడుతుందనే నమ్మకాన్ని కేజ్రీవాల్ వ్యక్తం చేశారు.

Related posts