తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహాన్ని ఏరియల్ సర్వే ద్వార పరిశీలించారు. ఈ సందర్బంగా మేడిగడ్డలో గోదావరి ప్రవాహ ఉధృతిపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్, వంతెనపై నుంచి దిగువకు విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
కాగా మేడిగడ్డ వద్ద సీఎంకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు, పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల, ఎంపి సంతోష్ తదితరులు ఉన్నారు. అనంతరం సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంప్హౌజ్లను సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మపురిలోని లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకుంటారు.
కరోనా వైరస్పై సీఎం జగన్ కొత్త అర్థాలు: సోమిరెడ్డి