తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం యాదాద్రి చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్ లో యాదాద్రి చేరుకున్న కేసీఆర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్ నుంచే యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకు ప్రత్యేక పూజలు చేశారు. భోజన విరామం తర్వాత కేసీఆర్ అక్కడ నుంచి పెద్ద గుట్ట చేరుకుని టెంపుల్ సిటీని సందర్శిస్తారు.
గుట్టపై మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను కేసీఆర్ సమీక్షిస్తారు. ఆలయానికి అనుబంధంగా ఉండే క్యూకాంప్లెక్స్లు, వసతి గృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా, సుందరీకరణ తదితర పనులపై అధికారులకు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రిగా రెండో సారి అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ యాదాద్రి సందర్శించడం ఇదే తొలిసారి.
అన్నాడీఎంకే అధినేత శశికళ… కార్తీ చిదంబరం వ్యాఖ్యలు