telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు రాజన్న సిరిసిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

రేపు ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల పర్యటనకు రానున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న కేసీఆర్‌…. 15 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత 12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. 12.45 గంటలకు సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న కేసీఆర్‌… 1.10 గంటలకు సిరిసిల్ల మండలం సర్ధాపూర్ లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 1.40 గంటలకు ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనాన్ని ప్రారంభించి… అధికారులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు.

Related posts