telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ పథకాలు యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి: కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్‌‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని కొనియాడారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీఎస్‌డీపీ.. 2018-19లో జీఎస్‌డీపీ 10.5శాతానికి పెరిగిందన్నారు. నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదన్నారు. 16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదన్నారు. 16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. మూలధనం వ్యవయంలో కేంద్రానిది కేవలం 12.8 శాతం అని.. గత ఐదేళ్లలో మూలధనం కింద రూ.1,65, 167 కోట్లు ఖర్చు చేశామన్నారు. సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణతో అద్భుతాలు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 24 గంటల పాటు ఇవ్వడంతో, పారిశ్రామిక, వ్యవసాయరంగం అభివృద్ది సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి చేయూతనిచ్చిందని కేసీఆర్ తెలిపారు.

Related posts