హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ విద్యార్థులు ఆందోళన చెందొద్దు అని తెలంగాణ సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ను మూసివేయరు అని సీఎం స్పష్టం చేశారు. హాస్టల్స్ నిర్వాహకులు అన్నం పెడుతారు అని కేసీఆర్ చెప్పారు. విద్యార్థులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు.
.అనాథశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్లో ఆహారం సరఫరా చేయాలి. కొన్ని రకాల వాహనాలు అనుమతించబడుతాయి. పాలు, కూరగాయలు, పండ్లు, నిత్యవసర వాహనాలు తిరగాల్సిందే. పశుగ్రాసం తీసుకెళ్లే వాహనాలను అనుమతిస్తారు. ఏ రాష్ట్రాలకు చెందిన వారినైనా ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు.