telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ప్రారంభం

KCR cm telangana

ఆర్టీసీ కార్మికుల సమ్మె పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, రవాణా కమిషనర్‌ సందీప్‌ కుమార్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రవాణా, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు.

దసరా పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్న వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. తాత్కాలిక పద్ధతిన నియమించిన డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి.

Related posts