telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

KCR cm telangana

కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు, రేషన్‌ పంపిణీ, ఇతర అంశాలపై సీఎం చర్చిస్తున్నారు.

వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Related posts