telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్ష నేతలకు సీఎం కేసీఆర్ ఫోన్

CM KCR Phone opposition Leaders

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈవిషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు బీజేపీ, ఎంఐఎం వెంటనే అంగీకారం తెలిపాయి. పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

శాసనసభ తొలి సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులచేత తాజాగా బాధ్యతలు చేపట్టిన ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సుమారు రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం శాసనసభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా గురువారమే ప్రారంభం కానుంది.

Related posts