telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కేసీఆర్

kcr special pooja in kaleswaram

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునిసిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై చర్చింది. ఈ కార్యవర్గ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం రోజున అన్ని గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రూ.19.2కోట్ల నిధులను పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించారు. టీఆర్ఎస్ భవన నిర్మాణానికి ఒక్కో జిల్లాకు రూ.60 లక్షలు కేటాయించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఈ నెల 27 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.

Related posts