మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ , ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సీఎం సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిశాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, మేడారం వెళ్లిరావడానికి హైదరాబాద్లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకూ జరిగే జరిగే మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు.