telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధాన మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ… కారణమిదే

టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య ప్రస్తుతం మాటల యుద్దం కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీ పార్టీని టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Related posts