telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం.. వీటిపైనే చర్చ

సీఎం కేసీఆర్‌ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుబంధు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈ ఏడాది రెండో విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ఈ మీటింగ్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కాగా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలిన విషయం తెలిసిందే.. గ్రేటర్‌ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటలేకపోయింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ టీఆర్‌ఎస్‌కు నిద్ర పట్టకుండా చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు చర్చకు వస్తాయని సమాచారం. భవిష్యత్తులో బీజేపీని ఎలా ఎదురుకోవాలనే దానిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Related posts