telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు

KCR cm telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో భాగంగా ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీ అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిబాబా థియేటర్‌ రోడ్డులో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ ఆ సభకు వెళ్లాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి  వెనుదిరుగుతున్నారు. 

Related posts